#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

కుట్టుమిషన్ శిక్షణతో మహిళలకు ఉపాధి : ఎమ్మెల్యే

మహిళలకు స్వయం ఉపాధి పెంపొందించేందుకె.. కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. కారంపూడి పట్టణంలోని సచివాలయం-2లో మంగళవారం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ తరగతూ లను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ మహిళాల స్వయం ఉపాధి కోసం.. కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమలను ప్రవేశ పెట్టనందని తెలిపారు. మహిళలు స్వయంగా తమ జీవనోపాధి పెంపొందించేందుకే… కుట్టు మిషన్ల శిక్షణ తరగతులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందు ఉంచేందుకే అనేక సంక్షేమలను ప్రవేశపెట్టిందన్నారు.