తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల*

హైదరాబాద్:తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐ ఆర్ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ వేశారు.
యాంకర్ శ్యామల పిటిషన్పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శ్యామలపై కేసు నమోదయింది. ఆంధ్ర 365’ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు శ్యామల ప్రమోషన్ చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్రారంభం కానున్న నేప థ్యంలో ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త బెట్టింగ్ యాప్ లు పుట్టుకొచ్చాయి. గతం లోని యాప్లు సహా కొత్త వాటి టార్గెట్ సామాన్య, మధ్య తరగతి ప్రజలే. బెట్టింగ్ యాప్ల వల్ల అప్పుల పాలై ఇటీవల కొందరు ఆత్మహత్య చేసుకున్నారు.