కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు

కార్తీక సోమవారం సందర్బంగా నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు కోటప్పకొండలో పర్యటించారు ఎమ్మెల్యే త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కోటప్పకొండలో భక్తుల సౌకర్యార్థం “దివిస్” లేబరేటరీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్ ను ప్రారంభించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు

అమరావతి చరిత్రాత్మక ఘట్టానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గము నుండి బయల్దేరిన ప్రజలు

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునః నిర్మాణం చరిత్రాత్మక ఘట్టానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గము నుండి వేలాది మంది ప్రజలు బస్సుల్లో బయల్దేరి వెళ్ళారు. తొలుత నల్ల చెరువు రోడ్డులో బస్సులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి ప్రారంబించారు. సుమారు 400 బస్సులో 25 వేల మంది ప్రజలతో 26 డివిజన్ల నుండి బయల్దేరీ వెళ్ళారు

అమరావతి పునః నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి

అమరావతి పునః నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ MLA ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, వివిధ ప్రాంతాల నుండి వచ్చి హాస్టల్లో ఉండే విద్యార్థినులకు, మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన తనను సంప్రదించవచ్చునని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు

మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానా అభివృద్ధికి కృషి చేస్తా – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు 35వ డివిజన్ పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానాను ఎమ్మెల్యే గళ్ళా మాధవి పరిశీలించారు. ముస్లిం సోదరులతో కలిసి ఇస్లామిక్ కౌన్సిల్ సెంటర్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… గతంలో ముస్లిం సోదరుల కోసం ఈ షాది ఖానా ను నిర్మించుకున్నారు

అమరావతి , ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు

అమరావతి , ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు వెలగపూడి సచివాలయం లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది 2025-26 వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసే ఈ సమావేశం లో మంత్రులు శ్రీ కె అచ్చెన్నాయుడు, శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్, వివిధ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

పాతపట్నం అభివృద్ధికి సహకరించాలంటూ సీఎంకు ఎమ్మెల్యే ఎంజీఆర్ వినతి

పాతపట్నం నియోజకవర్గంలో వ్యవసాయానికి సాగునీటి వసతి లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గోవిందరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఉండవల్లి కార్యాలయంలో కలిసి వినతి సమర్పించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలంటూ ఆయన కోరారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా మరమ్మతులు చేపట్టాలని ఎంజీఆర్ విన్నవించుకున్నారు.

విశాఖలో పాకిస్తానీ కుటుంబాన్ని గుర్తించిన పోలీసులు

విశాఖపట్నంలో పాకిస్తానీ కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు. విశాఖపట్నంలో నివసిస్తున్న పాకిస్థాన్ పౌరసత్వం కలిగిన కుటుంబం సోమవారం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీని కలిసింది. భర్త, పెద్దకుమారుడు పాకిస్థాన్ పౌరులు, భార్య, వారి చిన్న కుమారుడు భారత పౌరులు. ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులు దేశంవిడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. కుమారుడికి చికిత్సకోసం దీర్ఘకాల వీసా దరఖాస్తు పెండింగ్లో ఉందని విన్నవించారు. వివరాలు ప్రభుత్వానికి పంపినట్లు, తదుపరి నిర్ణయం త్వరలో తీసుకుంటామని సీపీ తెలిపారు

మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు

ఆర్యవైశ్య సంఘం నాయకులు కొత్త రామకృష్ణ, దేవరపల్లి కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్న మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు దాన్లో భాగంగా ఈరోజు ముఖ్యఅతిథిగా పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు గారు వచ్చి మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు.

పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

మత ప్రాతిపదికన పేర్లు అడిగి మీర 26 మందిని అత్యంత కిరాతకంగా చంపినా పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అలా మాట్లాడాలనుకుంటే వారు పాకిస్తాన్ కే వెళ్లిపోవాలని సూచించారు.

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది

మంచినీటి చలివేంద్రం ప్రారంభం సందర్భముగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి మంచినీళ్లు చలివేంద్రాన్ని ప్రారంభించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా .. రైల్వే స్టేషన సూపర్డెంట్ వెంకట్ రెడ్డి గారు ప్రముఖ వైద్యులు R k హాస్పిటల్ డాక్టర్ రామకృష్ణ గారు అలాగే ట్రస్ట్ చైర్మన్ ఆరెపల్లి ఏడుకొండలు గారు మరియు కొంతమంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది .. కార్యక్రమమూలో ఆటో డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ కూడా పాల్గొనడం జరిగింది..