ఫిబ్రవరి నాటికి 46 వేల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు

జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలో మంజూరైన 94,512 కుళాయి కనెక్షన్లు గానూ ఫిబ్రవరి 2025 నాటికి 46,316 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య మిషన్ (జల్ జీవన్ మిషన్) సమావేశాన్ని కలెక్టర్ పి.అరుణ్ బాబు నిర్వహించారు. రానున్న ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కునేందుకు రూ.3.87 కోట్ల ప్రణాళికను ఆమోదించారు. ఈ మొత్తాన్ని బోరు […]

ప్రపంచ యవనికపై అన్ని రంగాలలో మన జిల్లా బిడ్డలు ప్రకాశించాలన్న

చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ సెలబ్రేషన్స్/బంగారు బాల్యం బాలోత్సవాలు ముగింపు వేడుకలను పురస్కరించుకుని ఒంగోలులోని ఓల్డ్ గుంటూరు రోడ్డులో గల రవి ప్రియా మాల్ వద్ద నుండి పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ ని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్.పి శ్రీ ఏ ఆర్ దామోదర్ జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్ధులు […]

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ను చూడాల్సిన బాధ్యత పిల్లలదే

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఇచ్చిన ఫిర్యాదు కు సంబంధించి స్వయంగా వెళ్లి విచారణ చేపట్టిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. 18వ తేదీ సోమవారం రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఎడ్లపాడు గ్రామానికి చెందిన ఎడ్లూరి వెంకట్రావు అను వ్యక్తి పల్నాడు జిల్లా ఎస్పీకి తన ఒక్కగానొక్క కుమారుడు అయిన నాగరాజు ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని గొడవ పడుతూ తన ఆస్తి కాజేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. […]

ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రాష్ట్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ర్యాంకింగ్ లో కడప జిల్లాకు రెండో స్థానం గ్రామ స్థాయిలో వైద్యారోగ్య శాఖలో వైద్యాధికారులు,అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ.. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో… ఆరోగ్యశ్రీ, అనుబంధ ఆస్పత్రుల ప్రభుత్వ, వైద్యులు ,పట్టణ, […]

రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంఘం చైర్మన్ గా P. విజయకుమార్

రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పెద్దపూడి విజయకుమార్ కు అభినందనలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పెద్దపూడి విజయకుమార్ కు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత జాతికి న్యాయం చేయాలని, దళిత సంక్షేమం కోసం పాటుపడాలని విజయ్ […]

ఆటో డ్రైవర్ పోగొట్టుకున్న 47,000/- బాధితుడికి అప్పగించిన పోలీసులు

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు పోగొట్టుకున్న 47,000/- నగదును వెతికి – కనిపెట్టి, రెండు రోజుల్లో మంగళగిరి రూరల్ పోలీసులు బాధితునికి అప్పగించారు. ఈనెల 18న మంగళగిరి హైవేపై హల్చల్ చేసి ట్రాఫిక్ జామ్ చేసిన అఘోరాని చూడటానికి ఆటో డ్రైవర్ కిందకి దిగారు. ఆ సమయంలో తన ప్యాంటు జేబులో పెట్టుకున్న రూ.47,000/- నగదును బాడుగ ఆటో డ్రైవర్ పోగొట్టుకున్నాడు. తాను పోగొట్టుకున్న నగదు తన ఓనర్ ఫర్నిచర్ కొనుగోలు […]

చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్‌ విప్‌ పదవి అదృష్టమని జేకేసీ కళాశాలలో నూతన ఆడిటోరియం ప్రారంభ సభలో పేర్కొన్న జీవి ఆంజనేయులు

కూటమి ప్రభుత్వంలో అసెంబ్లీలో చీఫ్ విప్‌గా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని వినుకొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. బుధవారం గుంటూరు జేకేసీ కళాశాలలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జాగర్లమూడి లక్ష్మయ్య చౌదరి పేరుతో ఆడిటోరియాన్ని నిర్మించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జీవీ మాట్లాడుతూ ఎంతోమంది నాయకులు , ఉన్నతాధికారులు, వివిధ హోదాల్లో […]

ఇళ్ళ మధ్య ఉన్న ఖాళీ స్థలాల నిర్వహణలో స్థల యజమానుల నిర్లక్ష్యం ఫై అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గళ్లా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇళ్ళ మధ్య ఉన్న ఖాళీ స్థలాల వలన జరిగే ఇబ్బందులను శాసన సభా సాక్షిగా మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ ఖాళిస్థలాల విషయాన్నీ ప్రస్తావించారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో సుమారు 10 నుండి 15 ఖాళీ స్థలాలు ఉంటాయని, ప్రధానంగా 21, 25, 28, 29, 36, 39, 43 డివిజన్ లలో అధికంగా ఉంటున్నాయని, వీటి […]

జనంలోకి మనం.

త్వరలో ప్రజలతో ముఖాముఖి రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం నుంచి ప్రజలకు సంక్షేమం అందిస్తాం. దీనికి సమయం కావాలి. ఇది అసాధ్యం కాదు. అలా అని రాత్రికి రాత్రే అన్నీ అయిపోవు. అభివృద్ధి, సంక్షేమంలో సవాళ్లు, సమస్యలను అధిగమించి ముందుకు వెళ్తాం. – చంద్రబాబు