మే డే ను కార్మిక వాడల లో అరుణ ప్రతాకాలు ఆవిష్కరించి ఘనంగా నిర్వహించండి.

నరసరావుపేట: పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలలో “మేడే” నాడు కార్మిక వాడలలో పరిశ్రమల కేంద్రాలలో ఏఐటీయూసీ అరుణ పతాకాలు ఆవిష్కరించి “మే డే” ను ఘనంగా నిర్వహించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట సిపిఐ కార్యాలయంలో జరిగిన సిపిఐ జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు అధ్యక్షత వహించగా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్మికుల శ్రమ శ్వేద బిందువుల […]

కుట్టుమిషన్ శిక్షణతో మహిళలకు ఉపాధి : ఎమ్మెల్యే

మహిళలకు స్వయం ఉపాధి పెంపొందించేందుకె.. కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. కారంపూడి పట్టణంలోని సచివాలయం-2లో మంగళవారం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ తరగతూ లను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ మహిళాల స్వయం ఉపాధి కోసం.. కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమలను ప్రవేశ పెట్టనందని తెలిపారు. మహిళలు స్వయంగా తమ జీవనోపాధి పెంపొందించేందుకే… కుట్టు మిషన్ల శిక్షణ తరగతులను […]

గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్ చైర్మన్

గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్ చైర్మన్ గా నియమితులైన వడ్రాణం హరిబాబు గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు వడ్రాణం హరిబాబు గారికి శాలువా కప్పి, మొక్కను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు.

నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేస్తాం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

అమరావతిలో మే 2 వ తేదీన జరగనున్న పున ప్రారంభ కార్యక్రమానికి విచ్చేయనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేద్దాం అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది

ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, గుంటూరు సాయి కళ్యాణ చక్రవర్తిని

ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, గుంటూరు సాయి కళ్యాణ చక్రవర్తిని స్థానిక న్యాయస్థాన సముదాయ భవనంలో మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

ఉపాధి శ్రామికుల వేతనాలు రూ.300 పైనే అందేలా పనులు చేపట్టండి

నరసరావు పేట, ఏప్రిల్ 26 జిల్లాలో ఉపాధి హామీ శ్రామికుల సగటు వేతనం రూ.300 పైనే ఉండేలా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు.

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

పత్రికా ప్రకటన, 28/4/25:ప్రజా సమస్యల పరిష్కార వేది క’లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి 168 అర్జీలను స్వీకరించారు.

వైద్యారోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్ధ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 100 పడకలకు పైగా సామర్ధ్యం ఉన్న ఆస్పత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయని, మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ నిర్మాణం జరిగేలా త్వరితిగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలని, ఇందుకోసం […]

ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మహిళా ప్రాంగణం నందు నిర్మించిన ఉద్యోగినుల వసతి భవనాన్ని ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి గారు, కలెక్టర్ నాగలక్ష్మి గారితో కలిసి మహిళా ప్రాంగణం నందు నిర్మించిన ఉద్యోగినుల వసతి భవనాన్ని ప్రారంభించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు.

స్విమ్మింగ్ ఫూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి.

గుంటూరు శ్యామల నగర్ లోని రవీంద్ర నగర్ లోని ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ఇంచార్జి మేయర్ సజిల గురువారం ప్రారంభించారు. గతంలో మరమ్మత్తులకు గురయ్యిన ఈ స్విమ్మింగ్ పూల్ ను సుమారు రూ 25 లక్షలతో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు.