ప్రజల ఆరోగ్యరక్షణకు కాటూరి వైద్యకళాశాల చేస్తున్న కృషి వెలకట్టలేనిది : మాజీమంత్రి ప్రత్తిపాటి

ప్రజల ఆరోగ్యరక్షణ కోసం కాటూరి వైద్య కళాశాల పనిచేస్తోందని, వైద్యసిబ్బంది నేరుగా మొబైల్ ల్యాబ్ ద్వారా తమ ఇళ్లవద్దకు వచ్చి అందిస్తున్న వైద్యసేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. చిలకలూరిపేట మండలం గోపాలవారిపాలెం గ్రామంలో కాటూరి వైద్య కళాశాలవారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి సహాయసహాకారంతో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపుని మాజీమంత్రి ప్రత్తిపాటి శుక్రవారం ప్రారంభించారు.

నరసరావుపేట పట్టణంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ

నరసరావుపేట పట్టణంలో శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు స్థానిక 25 వ వార్డు పెద్దచెరువు లో పర్యటించారు సైడ్ కాలువలలో పూడికను తీశారు సైడ్ కాలువల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలు గడ్డిని తొలగించారు స్థానికులతో వార్డు లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్టంలో మరియు నియోజకవర్గం పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమలను వివరించారు సమస్యల పరిష్కారనికి అధికారులతో చర్చించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా”చదలవాడ మాట్లాడుతూ నరసరావుపేట […]

మహిళా ఖైదీ సూసైడ్.. ఇద్దరు సస్పెండ్

ఏలూరు జిల్లా జైల్లో నిన్న వాష్ రూంలో జీలుగుమిల్లి (M) ఆకులగూడేనికి చెందిన మహిళా ఖైదీ శాంతకుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె సూసైడ్ పై విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఆర్డీవో అంబరీష్ జైలును పరిశీలించారు. హెడ్వార్డర్ వరలక్ష్మి, వార్డర్ నాగమణిలు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడతోనే ఆమె సూసైడ్ కు ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేశారు

కొడాలి నాని కి బైపాస్ సర్జరీ ముంబై కి షిఫ్ట్!

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో ఏఐజీ ఆస్పత్రిలో చేరారు నాని. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయన గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారు.. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం సూచించారు డాక్టర్లు. అయితే సర్జరీ కోసం కొడాలి నాని ఈ రోజు ముంబై వెళ్తున్నారు. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ […]

అమరావతి, మార్చి 30 : పేదలకు సాయం అందించేందుకు ఉగాది రోజున సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ.38 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు లబ్ధి కలుగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటివరకు 23,418 మంది పేదలకు రూ.281.38 కోట్లను ప్రభుత్వం అందించింది.

పాస్పోర్ట్ సేవలకు పెరిగిన డిమాండ్ దృష్టిలో ఉంచుకొని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏప్రిల్ 5న ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆ రోజుకు విజయవాడ సేవా కేంద్రంలో 800, తిరుపతి సేవా కేంద్రంలో 500 స్లాట్లను శనివారం విడుదల చేశారు. ఇప్పటికే ఉన్న దరఖాస్తుదారులు తమ అపాయింట్ మెంట్లు రీషెడ్యూల్ చేసుకోవచ్చని ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి శివహర్ష ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే కాకుండా ఏప్రిల్లో ప్రతి బుధవారం విజయవాడ సేవా కేంద్రంలో […]

ఉగాది రోజు పేదలకు సాయంపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం

అమరావతి, మార్చి 30 : పేదలకు సాయం అందించేందుకు ఉగాది రోజున సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ.38 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు లబ్ధి కలుగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటివరకు 23,418 మంది పేదలకు రూ.281.38 కోట్లను ప్రభుత్వం అందించింది.

ఏపీలో వాటర్ ఎయిర్ పోర్టులు.. సీఎం కీలక ఆదేశాలు

పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు సీ ప్లేన్ సేవల్ని ఆరంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్, వైజాగ్ సముద్రతీరాల్లో నీటి విమానాశ్రయాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని CM చంద్రబాబు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ(APADC)కు సూచించారు. దీంతో అధ్యయనానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి APADC వచ్చే 3లోపు ప్రతిపాదనల్ని ఆహ్వానించింది

పాపం : కడుపులో కత్తెర మర్చిపోయారు

హైదరాబాద్:మార్చి 29 లక్నోలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న 17 సంవత్సరాల తర్వాత ఒక మహిళ కడుపులో శస్త్రచికిత్స కత్తెర బయటపడింది, సంధ్య పాండే అనే మహిళ ఫిబ్రవరి 28, 2008న ‘షీ మెడికల్ కేర్’ నర్సింగ్ హోమ్‌లో సి-సెక్షన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె భర్త అరవింద్ కుమార్ పాండే పోలీసు ఫిర్యాదు ప్రకారం.. శస్త్రచికిత్స జరిగినప్పటి నుండి ఆమెకు నిరంతర […]

మణిపూర్ భూకంపం

మణిపూర్ మరోసారి భూకంపం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం వల్ల కలిగిన నష్టం గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.

ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు..

ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీలకు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు స్వీకరణ గడువును ఏప్రిల్ 6 వరకు పొడిగించినట్లు కార్యదర్శి మస్తానయ్య తెలిపారు