కళాశాల డైరెక్టర్ దగ్గుబాటి శివ బ్రహ్మ రెడ్డి ఓ. శ్రీనివాస చారి

శ్రీ వైష్ణవి వారి ప్రగతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాల నూతన యాజమాన్యం, కళాశాల డైరెక్టర్ దగ్గుబాటి శివ బ్రహ్మ రెడ్డి ఓ. శ్రీనివాస చారి మాచిభట్టు . సుబ్బరాజు షేక్ జానీ బాషా యు.సోమేశ్వరరావు డేగల. శ్రీనివాసరావు కలిసి మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణని కలిసి వారి ఆశీర్వాదం తీసుకొని శ్రీ కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ కి 50 వేల రూపాయలు విరాళంగా చెక్కుని అందించారు

రేపు కలెక్టరేట్ లో ఎస్సీ,ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

రేపు (మార్చి 22, శనివారం)ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. జిల్లాలోని ఎస్సీలు, ఎస్టీలు ప్రత్యేక పరిష్కార వేదికను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు

ఈ నెల 29న జీవీఎంసీ బడ్జెట్ సమావేశం

ఏపీలోని మహా విశాఖ నగర పాలకసంస్థ  2025-26 బడ్జెట్ సమావేశాన్ని ఈనెల 29న నిర్వహించనున్నట్టు జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4,554.27 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు ముసాయిదా బడ్జెట్ రూపొందించింది. 29వ తేదీ నాటికి కొత్త కమిషనర్ను నియమిస్తే ఆయన ఆధ్వర్యంలోనే బడ్జెట్ సమావేశం జరుగుతుంది. ఎవరినీ నియమించకపోతే ఇన్చార్జి కమిషనర్ హోదాలో జిల్లా కలెక్టర్ హాజరవుతారు

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల*

హైదరాబాద్:తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్‌, వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐ ఆర్‌ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ వేశారు. యాంకర్‌ శ్యామల పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదయింది. ఆంధ్ర 365’ అనే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌కు శ్యామల ప్రమోషన్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ […]

అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు : చంద్రబాబు

ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదని CM చంద్రబాబు తెలిపారు. తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. ఏడు కొండలను ఆనుకొని గతంలో ముంతాజ్ హోటల్కు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నాం. ఏడుకొండల్లో ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండకూడదు. వేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటమే లక్ష్యం” అని చంద్రబాబు వివరించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు

ఈ సారి 9 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది మొత్తం 15 రోజులు అసెంబ్లీ సమావేశం జరిగాయి మొత్తం 85 గంటల 55 నిముషాలు ప్రజా సమస్యలపై శాసనసభ లో చర్చించారు మొత్తం 9 ప్రభుత్వ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది సహకార బ్యాంకుల అవకతవలపై సభా సంఘాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రతిపక్ష నాయకుల వ్యవహార శైలిపై స్పీకర్ రూలింగ్ ను పాస్ చేశారు.

ఈ నెల 29న సూర్య గ్రహణం

ఈ నెల 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి పాక్షికంగా కనిపిస్తుందని వెల్లడించింది. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని చెప్పింది. నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా, సౌత్ అమెరికా, గ్రీన్ లాండ్, ఐలాండ్ దేశస్థులు గ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చని స్పష్టం చేసింది. కాగా, కొత్త ఏడాదిలో ఇది తొలి సూర్య గ్రహణం కావడం విశేషం

ఏపీ శాసనమండలిలో కూటమి ప్రభుత్వం భారీ వ్యూహం.. ఆయనపై అవిశ్వాస తీర్మానం

ఏపీ శాసనమండలిలో వైసీపీకి బలం ఉంది. ఇది కూటమి ప్రభుత్వానికి మైనస్ గా మారుతుంది. మండలిలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు. అది మండలి చైర్మన్ విచక్షణ మీద ఆధారపడి ఉంది. ఈ క్రమంలోనే మండలిలో ఉన్న అవకాశాలను అందుకుని ఏకంగా చైర్మన్ మీదనే అవిశ్వాసం పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలలో కూటమి పెద్దలు ఉన్నారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ డిజిపిని కలిసిన సినీనటి కాదంబరి జస్వాని

రమాదేవి, ఐద్వా, స్టేట్ సెక్రెటరీ , తో కలిసి సినీనటి కాదాంబరి జత్వాని, గత ప్రభుత్వంలో అక్రమంగా కేసు రిజిస్టర్ చేశారని కేసును వెంటనే ఎత్తివేయాలని డిజిపి ని కలిసారూ కేసును త్వరిత గతిన పూర్తి చేయాలని డిజిపిని కలిసి వివరించామని తెలియజేశారు. డిజిపి 15 రోజులలో మీకు పూర్తి సమాచారం మళ్ళీ తెలియపరుస్తానని తెలియజేస్తామని డిజిపి తెలియజేశారని మీడియాకు తెలియజేశారు