అందరికి నమస్కారం

ఈ రోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు స్థానిక NGO కాలనీ పార్కు వద్ద నుండి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు, రోడ్లు శుభ్రం చేయుట. కాలవలు పూడికతీయుట. రోడ్లు పక్కన గడ్డి పిచ్చి మొక్కలు తీసివేయటం. ఈ కార్యక్రమంలో మన MLA గారు. మునిసిపల్ కమీషనర్ గారు,ముఖ్య అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు, కావున మహా కూటమి నేతలు కార్యకర్తలు, ఈ కార్యక్రమం […]

పల్లెబాట” మన ఊరు, మన పల్లెబాట

మార్చి 24, సోమవారం…. ఉదయం 10:00 గంటల నుండి సీతానగరం మండలం కూనవరం గ్రామంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, ఆయా శాఖల ఉన్నతాధికారులు, జనసేన, తెలుగుదేశం, బిజెపి సీనియర్ నేతలు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు (ఎన్డీఏ శ్రేణులు) గ్రామంలో పర్యటన…!!!ఈ కార్యక్రమం తో పాటుగా ” జనవాణి ” —–ప్రజా సమస్యల పరిష్కార వేదిక——- ప్రజల నుండి పలు సమస్యలపై వినతులు స్వీకరణ కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఈ కూటమి ప్రభుత్వం నుండి […]

జిల్లాలో 48 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఎఎస్.

జిల్లాలో 48 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఎఎస్. జిల్లాలో మార్చి 01 నుంచి 20వ తేదీ వరకూ 48 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ రాత పరీక్షలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. 17,905 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 14,529 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి మొత్తం 32,434 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారన్నారు. వీరితో పాటూ మరో 2117 మంది విద్యార్థులు మార్చి 03 నుంచి […]

రాష్ట్రంలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగింపు..

రాష్ట్రంలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగింపు.. ఈ నెల 8వ తేదీ వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం. 9న దరఖాస్తుల పరిశీలన.. 10న షాపుల కేటాయింపు సంబంధించి డ్రా.. అదే రోజు షాపుల కేటాయింపు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం

రానున్న 30 రోజులు అత్యంత కీలక సమయ‌మ‌ని.. విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే పదో తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్దం చేయడంతో పాటు వివిధ స‌బ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు కృషిచేయాలని, అత్యవసరమైతే తప్ప శెల‌వులు పెట్టొద్ద‌ని.. జిల్లా కలెక్టర్‌ డా. జి లక్ష్మీశ ఉపాధ్యాయులను ఆదేశించారు. మార్చి 17వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు నిర్వహించన్నున నేపథ్యంలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను స్వ‌యంగా పరిశీలించేందుకు శుక్రవారం […]

గుడ్‌ న్యూస్: వాట్సాప్‌లో ఇంటర్ హాల్ టికెట్లు

ఆంధ్రప్రదేశ్ : ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు నిలిపివేసే ఘటనల జరగకుండా ప్రభుత్వం చెక్ పెట్టింది. వాట్సాప్ ద్వారానే ఇంటర్ హాల్ టికెట్లు అందించనుంది. 95523 00009 నంబర్ ద్వారా విద్యార్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో పదో తరగతి విద్యార్థులకు సైతం ఇదే అవకాశాన్ని కల్పించాలని భావిస్తోంది

పల్నాడు లో మొట్ట మొదటి పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్

గురజాల మండలం గంగవరం గ్రామానికి చెందిన నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపకుడు కనకం శ్రీనివాసరావు కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.

పెట్రోల్ ధరలు తగ్గుతాయి: మోదీ

గత పదేళ్లలో 25 కోట్లమందిని పేదరికం నుంచి బయటపడేశామని ప్రధాని మోదీ తెలిపారు. లోక్సభలో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు. “వికసిత్ భారత్ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం. మధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అని నినాదాలు మాత్రమే చేశాయి. ఇథనాల్ బ్లెండింగ్తో పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గుతాయి” అని పేర్కొన్నారు.

రేపు మహాకుంభమేళాకు ప్రధాని మోదీ..?

ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళ జరుగుతున్న విషయం తెలిసిందే. దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ వేడు కలో పాల్గొని గంగా, య మునా, సరస్వతీ నదుల త్రివేణి సంగమం లో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నా రు. ఈ సందర్బంగా ఈనెల 5వ తేదీన భారత ప్రధాని మోదీ మహాకుంభమేళాను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాక కోసం యూపీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి రేపు ఉదయం 10 […]

అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి

ఏపీలో రాజధాని అమరావతిలో పలు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచేందుకు ఈసీ అనుమతిచ్చింది. ప్రస్తుతం కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది. దీంతో అమరావతిలో పనులకు అనుమతి ఇవ్వాలని సీఆర్డీఏ ఈసీకి లేఖ రాయగా అభ్యంతరం లేదని బదులిచ్చింది. టెండర్లు పిలవొచ్చని, అయితే ఎన్నికలు పూర్తయ్యాకే ఖరారు చేయాలని పేర్కొంది.