భగ్గుమంటున్న భానుడు.. ఫిబ్రవరిలోనే మండుతున్న ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు..

ప్రస్తుత ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు 3,4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.. గతేడాదితో పోలిస్తే ఈసారి వేసవిలో ఎండలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు ఫిబ్రవరి సగం నెల కూడా పూర్తి కాలేదు.. అప్పుడే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మార్చి నెలలో వచ్చే శివరాత్రితో చలి శివ శివా అనుకుంటూ వెళ్లిపోతుందని చెబుతారు.. కానీ, చలికాలం పూర్తవకుండానే ఎండలు మండిపోతున్నాయి.

రాజానగరం మండల చక్రద్వారబంధం గ్రామంలో నూతనంగా నిర్మించిన

రాజానగరం మండల చక్రద్వారబంధం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 15 వ తారీఖున అంగరంగ వైభవంగా జరగబోయే శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమానికి రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారిని ఆహ్వానించిన చక్రద్వారబంధం NDA కూటమి నాయకులు

బాపట్ల డిపో పరిధిలోని కొత్త రూట్లలో బస్సులు ఏర్పాటు చేయాలని వినతి.

రవాణా శాఖ మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారిని కోరిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు అమరావతి, జనవరి 05. బాపట్ల డిపో పరిధిలో కొత్త రూట్లలో బస్సుల ఏర్పాటుకు కృషి చేయాలని రవాణా శాఖ మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు సచివాలయంలో మంత్రి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి కోరారు.

వినుకొండ మండలం వినుకొండ నుండి కుమ్మరిపాలెం

వినుకొండ మండలం వినుకొండ నుండి కుమ్మరిపాలెం, తిమ్మాయిపాలెం, పానకాల పాలెం, శ్రీనగర్, వేస్తున్న తారు రోడ్డు పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు మాట్లాడుతూ, ఈ రోడ్డు నిర్మాణం వలన ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. అంతే కాకుండా, ఈ ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక […]

బిగ్ బ్రేకింగ్ న్యూస్……. మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలోని సరస్వతి సిమెంట్

బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలోని సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన 17.69 ఎకరాల అసైన్డ్ భూమిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవల రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ భూములపై సమగ్ర విచారణ చేయాలని అధికారులు ఆదేశించడంతో మాచవరం తాసిల్దార్ ఫారెస్ట్ అధికారులను ఆదేశాలు జారీ చేయడంతో సమగ్ర విచారణ జరిపిన అనంతరం పవన్ కళ్యాణ్ చెన్నై పాలెం గ్రామాన్ని సందర్శించి […]