పాతపట్నం అభివృద్ధికి సహకరించాలంటూ సీఎంకు ఎమ్మెల్యే ఎంజీఆర్ వినతి

పాతపట్నం నియోజకవర్గంలో వ్యవసాయానికి సాగునీటి వసతి లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గోవిందరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఉండవల్లి కార్యాలయంలో కలిసి వినతి సమర్పించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలంటూ ఆయన కోరారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా మరమ్మతులు చేపట్టాలని ఎంజీఆర్ విన్నవించుకున్నారు.