#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

విశాఖలో పాకిస్తానీ కుటుంబాన్ని గుర్తించిన పోలీసులు

విశాఖపట్నంలో పాకిస్తానీ కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు. విశాఖపట్నంలో నివసిస్తున్న పాకిస్థాన్ పౌరసత్వం కలిగిన కుటుంబం సోమవారం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీని కలిసింది. భర్త, పెద్దకుమారుడు పాకిస్థాన్ పౌరులు, భార్య, వారి చిన్న కుమారుడు భారత పౌరులు. ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులు దేశంవిడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. కుమారుడికి చికిత్సకోసం దీర్ఘకాల వీసా దరఖాస్తు పెండింగ్లో ఉందని విన్నవించారు. వివరాలు ప్రభుత్వానికి పంపినట్లు, తదుపరి నిర్ణయం త్వరలో తీసుకుంటామని సీపీ తెలిపారు